అమెరికా-చైనా ట్రేడ్ వార్: యాపిల్ లాంటి సంస్థలు భారత్వైపు మొగ్గు, త్వరలోనే సొంత స్టోర్లు
న్యూఢిల్లీ: అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికా, చైనాలు పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఒకే బ్రాండ్ విదేశీ ప్రత్యక్ష రిటైల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడంతో పలు దిగ్గజ కంపెనీలు మనదేశం వైపు చూస్తున్నాయి.

దేశీయంగానే యాపిల్ అమ్మకాలు
ఈ క్రమంలో భారత్లో ఆన్లైన్ అమ్మకాలతోపాటు రిటైల్ స్టోర్లను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తెలిపింది. తొలుత ‘యాపిల్ ఆన్లైన్ స్టోర్' ద్వారానే దేశీయంగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది.

రిటైల్ స్టోర్లు కూడా..
ఆ తర్వాత విదేశాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మనదేశంలో కూడా సొంత స్టోర్లను ఏర్పాటు చేయనుంది యాపిల్. ఇప్పటి వరకు థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడిన యాపిల్.. ఇక నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను అందించనుంది.

యాపిల్ తోపాటు మరికొన్ని సంస్థలు..
తొలుత ‘యాపిల్ ఆన్లైన్ స్టోర్' ద్వారానే దేశీయంగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. తదుపరి విదేశాల్లో ఏర్పాటు చేసిన తరహాలోనే దేశీయంగా సొంత స్టోర్లను నెలకొల్పనుంది. యాపిల్ తోపాటు ఫోక్సోన్, విస్ట్రన్ కార్ప్ లాంటి కంపెనీలు కూడా భారత్లో తమ సంస్థలకు చెందిన స్టోర్లను ప్రారంభించనున్నాయి.

నేరుగా యాపిల్ ఉత్పత్తులు.. తొలి స్టోర్ ముంబైలో..
ఆరు నెలల కాలంలోనే యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది వరకు ముంబైలో యాపిల్ తన తొలి రిటైల్ స్టోర్ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మనదేశంలో నేరుగా యాపిల్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో కొంత తక్కువ ధరకే మనకు అందుబాటులోకి రానున్నాయని మార్కటె్ విశ్లేషకులు చెబుతున్నారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications