India TV Opinion Poll 2022: యూపీలో బీజేపీ సునాయాస గెలుపు-యోగీదే అధికారమని వెల్లడి
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ అంచనా వేస్తోంది. తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.
ఇండియా టీవీకి చెందిన గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోంది. 403 సీట్లున్న యూపీ శాసనసభలో అధికార కాషాయ పార్టీకి 230-235 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 160-165 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు, బీఎస్పీ 2 నుంచి 5 సీట్లు గెల్చుకుంటాయని ఈ పోల్ తెలిపింది.
తొలిసారి గోరఖ్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఫైర్బ్రాండ్ బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ పార్టీ కంచుకోట నుంచి సునాయాసంగా విజయం సాధించనున్నారు. ముఖ్యంగా, 1971లో ఓడిపోయిన త్రిభువన్ నారాయణ్ సింగ్ తర్వాత జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేసిన రెండో నాయకుడు యోగీ ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న గోరఖ్పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది.

1998 నుంచి గోరఖ్పూర్ నుంచి ఆదిత్యనాథ్ రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యారు. ముఖ్యంగా, పూర్వాంచల్ ప్రాంతం 2007 ఎన్నికల నుండి రాజకీయ రంగును మారుస్తూనే ఉంది, ప్రతిసారీ ఎన్నికలలో యోగీకి మద్దతు లభిస్తూనే ఉంది. గోరఖ్పూర్ నుండి ఆదిత్యనాథ్ను పోటీకి దింపడం ద్వారా, బిజెపి తన 2017 ఫీట్ ను ఈ ప్రాంతంలో పునరావృతం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. తద్వారా లక్నోలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రతిష్ఠించడానికి వీలు కలగబోతంది.
ఉత్తరప్రదేశ్లో ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి -- ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 403 శాసనసభ స్థానాలకు గానూ 312 స్థానాలను కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. అధికార సమాజ్వాదీ పార్టీ 47 సీట్లు సాధించగా, కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లో విజయం సాధించింది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications