Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India TV Opinion Poll 2022: యూపీలో బీజేపీ సునాయాస గెలుపు-యోగీదే అధికారమని వెల్లడి

ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ అంచనా వేస్తోంది. తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలింది.

ఇండియా టీవీకి చెందిన గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోంది. 403 సీట్లున్న యూపీ శాసనసభలో అధికార కాషాయ పార్టీకి 230-235 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 160-165 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు, బీఎస్పీ 2 నుంచి 5 సీట్లు గెల్చుకుంటాయని ఈ పోల్ తెలిపింది.

తొలిసారి గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఫైర్‌బ్రాండ్ బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ పార్టీ కంచుకోట నుంచి సునాయాసంగా విజయం సాధించనున్నారు. ముఖ్యంగా, 1971లో ఓడిపోయిన త్రిభువన్ నారాయణ్ సింగ్ తర్వాత జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేసిన రెండో నాయకుడు యోగీ ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న గోరఖ్‌పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది.

India TV Opinion Poll 2022: BJP will retain power in uttar pradesh

1998 నుంచి గోరఖ్‌పూర్ నుంచి ఆదిత్యనాథ్ రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యారు. ముఖ్యంగా, పూర్వాంచల్ ప్రాంతం 2007 ఎన్నికల నుండి రాజకీయ రంగును మారుస్తూనే ఉంది, ప్రతిసారీ ఎన్నికలలో యోగీకి మద్దతు లభిస్తూనే ఉంది. గోరఖ్‌పూర్ నుండి ఆదిత్యనాథ్‌ను పోటీకి దింపడం ద్వారా, బిజెపి తన 2017 ఫీట్ ను ఈ ప్రాంతంలో పునరావృతం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. తద్వారా లక్నోలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రతిష్ఠించడానికి వీలు కలగబోతంది.

ఉత్తరప్రదేశ్లో ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి -- ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 403 శాసనసభ స్థానాలకు గానూ 312 స్థానాలను కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌ కేవలం 7 స్థానాల్లో విజయం సాధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+