భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం
జమ్మూ: జమ్మ కాశ్మీర్ ప్రాంతంలోని అత్యంత సున్నితమైన ఫల్లన్వాలా సెక్టార్లో భారత్ - పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక సరిహద్దు గస్తీ కేంద్రం సమీపంలో సుమారు 50 మీటర్ల పొడవు కలిగిన ఒక సొరంగ మార్గాన్ని భారత సైనికులు శుక్రవారం కనుగొన్నారు.
కాశ్మీర్లోకి మిలిటెంట్లను చొప్పించడానికి ఈ సొరంగ మార్గాన్ని నిర్మించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం మామూలుగా గస్తీ నిర్వహిస్తున్న భారత జవాన్లకు అధీన రేఖపై చాక్లా పోస్టు వద్ద భారత భూభాగంలో సుమారు 50 మీటర్ల పొడవున్న ఓ సొరంగం కనిపించిందని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు ఉండే ఈ సొరంగ మార్గం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్తోందని ఆ ప్రతినిధి తెలిపారు.
అయితే భారత్ వైపు బైటికి వచ్చే మార్గం లేనందున ఇది అసంపూర్తి సొరంగం కావచ్చన్నారు. మరిన్ని వివరాలు నిర్ధారించుకోవడానికి సైనికులు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారని, అయితే ఇది మందుపాతరలు అమర్చిన ప్రాంతం అయినందున దానికి కొంత సమయం పడుతుందన్నారు.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications