పరిస్థితి చేయి దాటింది.. తక్షణమే వెనక్కి వచ్చేయండి: కేంద్రం వార్నింగ్..!
దేశవ్యాప్త నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయక్కడ. హింసాత్మకంగా మారుతున్నాయి. రాజధానితో పాటు పలు ప్రధాన నగరాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం- ఇప్పటివరకు కనీసం 2,500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. వేలాదిమంది ఆందోళనకారులను అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది.
అదే ఇరాన్. నిరసనకారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో క్షేత్రస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారింది. సమాచార బ్లాక్ అవుట్తో దేశం లోపల, వెలుపల ప్రజల మధ్య సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. అక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్.. కీలక అడ్వైజరీ ఇచ్చింది. హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్కు ప్రయాణాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశవ్యాప్త నిరసనల అనంతరం ఇంటర్నెట్తో పాటు మొబైల్, ల్యాండ్లైన్ కనెక్టివిటీని నిలిపివేశారని గుర్తు చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే అడ్వైజరీ ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ముఖ్యంగా ఇరాన్.. ప్రత్యేకించి టెహ్రాన్కు వెళ్లవద్దని తెలిపింది.
ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం సైతం కోరింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, వాణిజ్య విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి ఇరాన్ను విడిచిపెట్టాలని సూచించింది. రాయబార కార్యాలయం పౌరులు, భారతీయ మూలానికి చెందిన వ్యక్తులు (PIOలు) అప్రమత్తంగా ఉండాలని, నిరసనలు, ప్రదర్శనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని, దౌత్య అధికారులతో సన్నిహితంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్లో ఉన్న భారత పౌరులందరూ తమ ప్రయాణ డాక్యుమెంట్లు, పాస్పోర్టులు, గుర్తింపుకార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఏదైనా సహాయం కోసం తమను సంప్రదించాలని సూచించింది. తక్షణ సహాయం కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాను విడుదల చేసింది. మొబైల్ నంబర్లు: +989128109115, +989128109109, +989128109102, +989932179359; ఈమెయిల్: [email protected].
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!












Click it and Unblock the Notifications