నలభై ఏళ్ల తర్వాత భారత్కు నిక్కీ హేలీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమెరికాలోని సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ న్యూఢిల్లీలోని ఫిక్కీ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రానికి చంఢీగడ్కు చేరుకుంటారని... శుక్రవారం నాడు అమృత్సర్ వస్తారని ఆ జిల్లా అధికారులు తెలిపారు.
అమెరికాకి వెళ్లక ముందు నిక్కీ హేలీ పూర్వీకులు 1960ల్లో వెర్కా ప్రాంతంలోనే నివసించింది. ఈ క్రమంలో సిక్కు పవిత్ర ఆలయం హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) ను దర్శించుకుని, ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇటీవలే దక్షిణ కరొలినా గవర్నర్ గా తిరిగి ఎన్నికయిన హేలీ, నాలుగు దశాబ్దాల్లో తన కుటుంబ సొంత రాష్ట్రంకు రావడం ఇదే తొలిసారి.

నలభై ఏళ్ల తర్వాత భారత్కు నిక్కీ హేలీ
ఇటీవలే దక్షిణ కరొలినా గవర్నర్ గా తిరిగి ఎన్నికయిన హేలీ, నాలుగు దశాబ్దాల్లో తన కుటుంబ సొంత రాష్ట్రంకు రావడం ఇదే తొలిసారి.

నలభై ఏళ్ల తర్వాత భారత్కు నిక్కీ హేలీ
న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ సదస్సులో పాల్గొన్న నిక్కీ హేలీ. తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్కు వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోత్న సూరీ పాల్గొన్నారు.

నలభై ఏళ్ల తర్వాత భారత్కు నిక్కీ హేలీ
న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ సదస్సులో పాల్గొన్న నిక్కీ హేలీ. తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్కు వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోత్న సూరీ పాల్గొన్నారు.

నలభై ఏళ్ల తర్వాత భారత్కు నిక్కీ హేలీ
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటనలో కలిసిన సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ.
"ఈ నెల 15న ఆమె గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అంతేగాక గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి, అక్కడి విద్యార్థులను కలుస్తారు. ఇక్కడ తన బంధువులను కూడా కలవనున్నారు" అని అమృత్ సర్ జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.
1972లో జన్మించిన నిక్కీ హేలీ 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమృత్సర్ను సందర్శించారు. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధ్వా వెర్కా వెర్కా ప్రాంతంలో నివసించారు. తన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గాను నిక్కీ హేలీ పది రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. ఈ పది రోజుల్లో న్యూఢిల్లీ, ముంబై, చంఢీగడ్, అమృత్ సర్లను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications