వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఛార్జీలు, లోయర్ బెర్తుల కేటాయింపు ఇలా..!!
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది.
ఈ పరిణామాల మధ్య ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి. హౌరా-కామాఖ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. నంబర్ 27575 హౌరా- కామాఖ్య వందే భారత్ స్లీపర్ గురువారం మినహా మిగిలిన అన్ని రోజులలో నడుస్తుంది. నంబర్ 27576 కామాఖ్య- హౌరా రైలు బుధవారం మినహా ఇతర అన్ని రోజులు రాకపోకలు సాగిస్తుంది. తాజాగా ఈ రైళ్లకు సంబంధించిన ఛార్జీలు, టికెటింగ్ నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

- 1AC, 2AC, 3AC క్లాస్ లకు ప్రత్యేక బేసిక్ ఛార్జీలు.. రైలులో అందుబాటులో ఉండే అన్ని సర్వీస్ లనూ కవర్ చేస్తాయి. దీనికి జీఎస్టీ మాత్రం అదనం.
- 400 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీని నిర్ధారించారు. 400 నుండి 3,500 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు 1ACలో రూ. 1,520 నుండి రూ. 13,300, 2ACలో రూ. 1,240 నుండి రూ. 10,850, 3ACలో రూ. 960 నుండి రూ. 8,400 వరకు ఛార్జీలు వర్తిస్తాయి.
- వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లో కన్ఫర్మ్డ్ టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తారు. ఆర్ఏసీ (RAC) గానీ, వెయిటింగ్ లిస్ట్ గానీ ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రారంభం నుంచే అన్ని బెర్త్లు బుకింగ్కు అందుబాటులో ఉంటాయి.
- రిజర్వేషన్ కోటాల విషయానికి వస్తే, మహిళలు, దివ్యాంగులు (PWD), సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ కలిగిన వారికి మాత్రమే నిర్దేశిత కోటాలు వర్తిస్తాయి. ఈ రైళ్లలో ఇతర రిజర్వేషన్ కోటాలు ఉండవని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
- పిల్లల ఛార్జీల నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి.
- టికెట్ల కొనుగోలుకు పూర్తిగా రీయింబర్స్ అయ్యే పాస్లు/వారెంట్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. రైల్వే ఉద్యోగుల డ్యూటీ పాస్ అర్హతలు రాజధాని తరహా రైళ్లతో సమానం. రాయితీ టిక్కెట్లు లేదా రీయింబర్స్ కాని ఉచిత పాస్లు ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లలో చెల్లవు.
- టికెట్ కొనుగోలుకు చేసిన అన్ని చెల్లింపులు డిజిటల్గా మాత్రమే జరుగుతాయి. కౌంటర్లలో కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తారు. టిక్కెట్ రద్దు అయిన 24 గంటలలోపు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ డిజిటల్ చెల్లింపు సాధ్యం కాకపోతే రీఫండ్ సాధారణ నిబంధనల మేరకే ఉంటుంది.
- ప్రయాణ సమయంలో ప్రత్యేక బెర్త్ అవసరం లేని పిల్లవాడితో ప్రయాణిస్తున్నవారికి, లభ్యతను బట్టి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. అలాగే, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు కూడా లభ్యతను బట్టి ఆటోమేటిక్గా లోయర్ బెర్తులు కేటాయిస్తారు.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేయాలని CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ను రైల్వే బోర్డు ఆదేశించింది. అలాగే, అన్ని జోనల్ రైల్వేలు ఈ వివరాలను తమ సిబ్బందికి ముందుగానే తెలియజేయాలని సూచించింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications