Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్వి

మంగళూరు: భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలని, అక్కడికే పంపాలని విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి బాలికా సరస్వతీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడేవారిని అక్కడికే తరిమికొట్టాలని, ఏమాత్రం సహించకూడదని చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సాద్వి బాలిక సరస్వతీ మార్చి 1న మంగళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు.

దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ పరాయి దేశం పాక్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి.. అక్కడికే తరిమేయాలన్నారు. ఇలాంటివాటిని సహిచంబోమని, దెబ్బకు దెబ్బకు తీయాల్సిందేనని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అన్నారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోనూ ఒక రామమందిరం నిర్మించాలని, అక్కడికి కూడా వెళ్లి మనమంతా పూజలు నిర్వహించాలంటూ వ్యాఖ్యానించారు.

Indians praising Pakistan should be ‘hit with shoes': Sadhvi Balika Saraswati

భారత్ స్వాతంత్ర్యాన్ని శాంతియుతంగా పొందిందని చరిత్ర చెప్పొచ్చుగానీ, మీ స్వాతంత్ర్యం మాత్రం శాంతియుతంగా లేదంటూ పాక్‌ను ఉద్దేశించి అన్నారు. మనందరం ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని సభనుద్దేశించి అన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు, ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సుమోటోగా స్వీకరించి మేమే చర్యలు తీసుకోవచ్చా అనే దిశగా ఆలోచన చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+