ఇందిరా క్యాంటీన్ లో అన్నం, సాంబర్ తిన్న రాహుల్ గాంధీ, జయలలితను ఫాలో అయ్యారు !
పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు.
బెంగళూరు: పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. బెంగళూరులోని జయనగరలోని కనకనపాళ్యలో బుధవారం ఇందిరా క్యాంటీన్ ను రాహుల్ గాంధీ ప్రారంభించారు.
ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని 101 వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన సందర్బంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు అతి తక్కువ ధరకు ఇక్కడ అల్పాహారం, భోజనం తినడానికి చక్కటి అవకాశం ఉందని అన్నారు.

ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించిన సిద్దరామయ్య ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అభినందించారు. ఈ సందర్బంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ బెంగళూరు నగరంలో 101 ఇందిరా క్యాంటీన్లు బుధవారం నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
బెంగళూరులోని అన్ని వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, సరైన స్థలం చిక్కకపోవడంతో 97 ఇందిరా క్యాంటీన్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని సిద్దరామయ్య వివరించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన తరువాత అక్కడ రాహుల్ గాంధీ అన్నం, సాంబార్, వాంగీబాత్ తిన్నారు.
ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కర్ణాటక పట్టణాభివృద్ది శాఖా మంత్రి కేజే. జార్జ్, మంత్రులు పాల్గోన్నారు. తమిళనాడులో పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే తరహాలో బెంగళూరులో పేద ప్రజల కోసం ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications