ఇందిరా క్యాంటీన్ లో అన్నం, సాంబర్ తిన్న రాహుల్ గాంధీ, జయలలితను ఫాలో అయ్యారు !
పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు.
బెంగళూరు: పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. బెంగళూరులోని జయనగరలోని కనకనపాళ్యలో బుధవారం ఇందిరా క్యాంటీన్ ను రాహుల్ గాంధీ ప్రారంభించారు.
ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని 101 వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన సందర్బంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు అతి తక్కువ ధరకు ఇక్కడ అల్పాహారం, భోజనం తినడానికి చక్కటి అవకాశం ఉందని అన్నారు.

ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించిన సిద్దరామయ్య ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అభినందించారు. ఈ సందర్బంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ బెంగళూరు నగరంలో 101 ఇందిరా క్యాంటీన్లు బుధవారం నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
బెంగళూరులోని అన్ని వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, సరైన స్థలం చిక్కకపోవడంతో 97 ఇందిరా క్యాంటీన్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని సిద్దరామయ్య వివరించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన తరువాత అక్కడ రాహుల్ గాంధీ అన్నం, సాంబార్, వాంగీబాత్ తిన్నారు.
ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కర్ణాటక పట్టణాభివృద్ది శాఖా మంత్రి కేజే. జార్జ్, మంత్రులు పాల్గోన్నారు. తమిళనాడులో పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే తరహాలో బెంగళూరులో పేద ప్రజల కోసం ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications