వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లాష్ బ్యాక్: జయం ప్రసంగం వినడం కోసం ఇందిర వచ్చారు

పార్లమెంట్ ఉభయ సభలు జయలలితకు సంతాపం ప్రకటించిన నేపథ్యంలో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జయ రాజకీయ రంగప్రవేశం చేసిన తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశమంతటా తమిళనాట అమ్మ అస్తమయం గురించే చర్చ. జయ జీవిత ప్రస్థానంలోని కీలక మలుపులు.. ఆమె రాజకీయ జీవితంలోని ఒడిదుడుకులను గురించి ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. జయ జీవితంలో కీలకంగా మిగిలిపోయిన పలు ఆసక్తికర ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.

Indira Gandhi came to Rajya Sabha to hear Jayalalithaa’s speech, recalls Kurien

పార్లమెంట్ ఉభయ సభలు జయలలితకు సంతాపం ప్రకటించిన నేపథ్యంలో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జయ రాజకీయ రంగప్రవేశం చేసిన తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. జయలలిత ప్రసంగం వినడం కోసం ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ సైతం రాజ్యసభకు వచ్చారని కురియన్ వెల్లడించారు.

రాజ్యసభలో జయలలిత ప్రసంగించడం అదే తొలిసారని, ఆ సమయంలో తాను లోక్ సభ సభ్యుడిగా ఉన్నానని కురియన్ పేర్కొన్నారు.జయలలిత ప్రసంగించినప్పుడు గ్యాలరీ అంతా నిండిపోయిందని చెప్పుకొచ్చిన కురియన్.. ఆమె ప్రసంగం అందరిని ఆకట్టుకుందని తెలిపారు.

జయలలిత ప్రసంగం ఆరోజుకు హైలైట్ గా నిలిచిందని, సినీ పరిశ్రమ నుంచి వ్యక్తి ఇంత అద్భుతంగా మాట్లాడగలదా? అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారని కురియన్ అన్నారు. ప్రజా జీవితంలో జయ ప్రస్థానం చిరస్మరణీయమైనదిగా, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషిని కురియన్ కొనియాడారు.

English summary
The curtains to the illustrious career of J Jayalalithaa came down on Monday when the 68-year-old chief minister passed away after battling for her life for over two months at Apollo Hospital in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X