వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను పిస్టల్‌తో కాల్చి చంపిన భార్యకు జీవిత ఖైదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Indore woman gets lifer for killing hubby over domestic issue
న్యూఢిల్లీ: భర్తను చంపినందుకు 20ఏళ్ల మహిళకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం నాడు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇండోర్‌లోని ఖజ్‌రానా ప్రాంతంలో జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ విమల్ మిశ్రా వెల్లడించిన సమాచారం ప్రకారం ఆమె పేరు సోను అలియాస్ నజియా.

తన చెల్లెలిని చెడు ఉద్దేశ్యంతో చూశాడన్న ఆరోపణతో భర్తను పిస్టల్‌తో కాల్చి చంపిందని తెలిపింది. మార్చి 2013లో ఈ ఘటన జరిగింది. నజియా బాధితుడికి రెండవ భార్య. భర్త నిద్రపోతున్న సమయంలో ఇంటి తలుపుకి గడియపెట్టి అతని తలపై కాల్చింది.

పిస్టల్ సౌండ్ విన్న చుట్టు పక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి తలుపులు బద్దలు కొట్టి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆతను మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నజియాను అరెస్టు చేసి బాధితుడిని చంపేందుకు వాడిని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణలో తన భర్త చెల్లెలతో చెడుగా ప్రవర్తించడం వల్లనే కాల్చి చంపానట్లు వెల్లడైందని పేర్కొన్నారు.

English summary
District court on Friday awarded life imprisonment to a 20-year-old woman for killing her husband over a petty domestic issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X