మోడీ ఆదర్శం: స్యేషన్లో ఛాయ్ అమ్మే స్త్రీ విలేజ్ ప్రధాన్
లక్నో: ఛాయ్వాలా నుంచి ప్రధాని వరకు ఎదిగిన నరేంద్ర మోడీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆదర్శంగా తీసుకుంది. ఆమె గ్రామానికి సర్పంచ్ అయ్యారు. ప్రధాని మోడీ 29 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న ఆ మహిళ 16 గ్రామాలకు సర్పంచ్గా ఎంపికయ్యారు.
ఉత్తర ప్రదేశ్లోని నాగ్లాకరన్ గ్రామానికి చెందిన పూజాకుమారి వృత్తిరీత్యా చాయ్ అమ్ముతుంటుంది. ఇటీవల జరిగిన గ్రామ్ ప్రధాన్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. ఎన్నికల్లో కుమారి 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే 65 ఏళ్ల తర్వాత మహిళ సర్పంచ్గా ఎన్నిక కావడం ఆమెకే సొంతమైంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ్ ప్రధాన్ ఎన్నికల్లో గెలుపొందడం గర్వంగా ఉందని, గెలుపుకు ప్రధాని మోడీయే తనకు ప్రేరణ అని చెప్పింది. ఈ విజయం తన కుటుంబానికి గొప్ప సంతోషాన్నిచ్చిందని, మోడీ ప్రసంగాలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని తన భర్త మద్ధతుతో విజయం సాధించానంది.
అత్తమామలు ఎప్పటి నుంచో పాటియాలి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే వారని, తనకు పెళ్లైన తర్వాత తాను కూడా భర్తతో కలిసి టీ అమ్మడం ప్రారంభించానని, ఆ సమయంలో ప్రజలతో పరిచయాలు పెరిగాయని, అప్పుడే ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నానని, మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతానని పేర్కొంది. ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications