అధిక జరిమానాలు విధిస్తేనే... ప్రజలు భయపడతారు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఇటివల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే... వేల రూపాయల జరిమానాలు వేయడంతో పలువాహానదారుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అయితే కేంద్రం పెద్ద ఎత్తున జరిమానాలు విధించడాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమర్ధించుకున్నారు. ఆ మాత్రం జరిమానాలు లేకపోతే ప్రజలు బయపడే పరిస్థితి లేదని చెప్పారు.
చట్టమంటే ఏ మాత్రం లెక్కచేయని ప్రజలకు కేంద్రం ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం లోని జరిమానాలతో ప్రజలు దారికి వస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు విషయంలో ప్రజలు అశ్రద్దగా వ్వవహరించారని, చట్టాలపై గౌరవం గాని,భయం గాని లేకుండా ఉన్నారని ఆయన చెప్పారు. ఇక పరిస్థితి పోవాలంటే కఠిన నిబంధనలు అవసరం అని అన్నారు. మరోవైపు అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే.. విదేశీ రహదారుల వలే భారత దేశ రహాదారులు కూడ మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటీ సంధర్భంలోనే ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు.

ఇక కొత్త చట్టం ముందు అందరు సమానమేనని చెప్పిన ఆయన ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడ జరిమానాలు కడుతున్నారని చెప్పారు.ఈనేపథ్యంలోనే అధిక మొత్తంలో ఒకసారి జరిమానాలు కట్టిన వారు మరోసారి ట్రాఫిక్ను ఉల్లంఘించకుండా ఉంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications