విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ: బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాన్ని చెల్లించకుండా రుణాలను ఎగవేసి తప్పించుకుతిరుగుతున్న పారిశ్రామికవేత్త, కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యాకు తీరని కష్టాలు వచ్చాయి. విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధం అయ్యింది.
విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చెయ్యాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. విజయ్ మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లకు పైగా రు రుణాలు ఎగవేసి విదేశాల్లో తప్పించుకు తిరుగుతున్నారనే విషం తెలిసిందే.
గత
మంగళవారం
ఎన్
ఫోర్స్
మెంట్
డైరెక్టరేట్
ఇచ్చిన
ఫిర్యాదు
మేరకు
ఢిల్లీ
హై
కోర్టు
విజయ్
మాల్యాకు
నోటీసులు
జారీ
చేసింది.
ఈ
విషయంపై
ఈ
నెల
20
లోపు
స్పందించాలని
కోర్టు
ఆదేశాలు
జారీ
చేసింది.
అయితే
విజయ్
మాల్యాను
బ్రిటన్
నుంచి
భారత్
రప్పించే
విషయంలో
కేంద్ర
ప్రభుత్వానికి
పెద్ద
ఎదురు
దెబ్బతగిలింది.
మా చట్టంప్రకారం మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే కేసు విచారణలో భారత్ కు పూర్తి సహకరిస్తామని బ్రిటన్ చెప్పింది. 1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి పాస్ పోర్ట్ న్యాయపరంగా చాలామణిలో ఉంటే సంబంధితవ్యక్తిని తాము దేశం విడిచి వెళ్లి పోవాలని ఆదేశాలు జారీ చెయ్యలేమని బ్రటిన్ ప్రభుత్వం తెలిపింది.