బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో జేజేపీ ఎన్నికల హామీల అమలు సాధ్యమేనా?
హర్యానాలో ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడంతో జననాయక్ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా మనోహర్లాల్ ఖట్టర్ ,ఆయనతోపాటు జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ సక్సెస్ కాదు అనే టాక్ వినిపిస్తుంది.
ఎన్నికల ముందు హర్యానాలోని ప్రజలకు జెజేపి తన మేనిఫెస్టోలో కీలకమైన వాగ్దానాలు ఇచ్చింది. అయితే ఆ వాగ్దానాలను బిజెపితో పొత్తు కారణంగా నెరవేర్చలేదు అన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతులు మరియు వ్యాపారస్తులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు నెలవారి 11000 రూపాయల భత్యం ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టమని తెలుస్తుంది. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు చేసిన వాగ్దానాలు రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదని, రాష్ట్రానికి అంత ఆదాయవనరులు లేవని, అవన్నీ ఉత్త మాటలని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

ఇక జెజేపి తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా హామీలను గుప్పించింది. ఇక తాజాగా బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జే జే పి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై ఏం చేయబోతున్నారు అన్న అంశంపై ఆసక్తి సర్వత్రా నెలకొంది. కమిటీ ఏర్పాటు చేసి వాగ్దానాల మలుపై ఏకాభిప్రాయం సాధించాలనే ఆలోచనలో దుష్యంత్ చౌతాలా ఉన్నారు . బిజెపి, జేజెపి లతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయానికి రావటానికి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించి ఇక అందులో ఎన్నికల వాగ్దానాలను చేర్చే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఈ నేపధ్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సిర్సా లో పేర్కొన్నారు. హర్యానా లోని అన్ని రకాల ఉద్యోగాలను స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నెలవారి వృద్ధాప్య పెన్షన్లు 5 100 రూపాయలకు పెంచటం, రైతులకు కనీస మద్దతు ధర అందించడం వంటి హామీలను ఇచ్చిన జెజెపీ ఈ హామీల అమలుకు బిజెపి సర్కారును ఒప్పిస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే బిజెపి ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుతామని మాత్రమే హామీ ఇచ్చింది. ఇక ఈ నేపద్యంలో జేజేపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు బీజేపీతో కలిసి సాగుతున్న తరుణంలో కష్టమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications