కుప్వారాలో మంచు చరియలు పడి 9మంది గల్లంతు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో హిమపాతం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా, కుప్వారా జిల్లాలో శుక్రవారం మంచు చరియలు విరిగిపడి దాదాపు తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఆరుగురు ప్రయాణికులతో కుప్వారా నుంచి కర్నాహ్ వెళ్తున్న ఓ వాహనంపై మంచు చరియలు పడడంతో ఆ వాహనంలోని ఆరుగురు, అదే మార్గంలో వెళ్తున్న మరో ముగ్గురు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

పోలీసు బృందాలు, సైనిక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, మౌంటెన్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గల్లంతైన వారిలో సరిహద్దు రోడ్డు ఆర్గనైజేషన్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. వెలుతురు లేకపోవడం, ఉష్ణోగ్రతలు సున్నా కంటే అత్యంత తక్కువగా ఉండటం వల్ల సహాయ చర్యలు కష్టతరమవుతున్నాయని అధికారులు తెలిపారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications