కాశ్మీర్లో ఎదురుకాల్పులు: నలుగురు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: కాశ్మీరులోని బుద్గాంలో సైన్యానికి, మిలిటెంట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు దాక్కున్నారని తమకు అందిన సమాచారం మేరకు భారత సైన్యం ఓ ఇంటిని చుట్టుముట్టింది.
మిలిటెంట్లకు, సైన్యానికి మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. భారత సైనిక వర్గాలు విషయాన్ని ధ్రువీకరించాయి.
జమ్మూ కాశ్మీర్లోని బుద్గాంలోని ఫుల్తిపొరా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు యువకులు గాయపడ్డారు. సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
భారత బలగాలను చూడగానే మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ప్రతి భారత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. బుద్గాం జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు.
ఇదిలావుంటే, ఉత్తర కాశ్మీర్లోని బారముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య మరో ఎన్కౌంటర్ జరుగుతోంది.