శ్రీనగర్లో పాక్ జెండాను ఎగరేసిన వేర్పాటువాద నేత: కేసు నమోదు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా, ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించిన కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆసియా అంద్రాబిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
హురియత్ కాన్ఫరెన్స్ మహిళా విభాగమైన దుఖ్తరన్ ఈ మిలత్కు ఆసియా నాయకత్వం వహిస్తున్నారు.
పాకిస్థాన్ జాతీయ దినోత్సవం రోజున అసియా బృందం శ్రీనగర్లో ఒక సభ ఏర్పాటు చేసి పాక్ పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినందుకు ఆమెపై కేసు పెట్టారు. త్వరలో అసియాను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా, తాను పాక్ పతాకాన్ని ఎగురవేయడమే కాదు.. మద్దతుదారులతో కలిసి జాతీయ గీతాన్ని కూడా పాడాను అని ఆసియా తెలిపారు.
కాగా, సోమవారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరైన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విందులో పాల్గొనడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications