36 ఏళ్ల తర్వాత పాక్ జైలు నుంచి విడుదలైన జైపూర్వాసి
కరాచి/న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని లాహోర్ సెంట్రల్ జైలు నుంచి ఓ భారతీయుడు 36 ఏళ్ల తర్వాత విడుదలయ్యారు. ఈ మేరకు సోమవారం అతనిని విడుదల చేశారు. సత్ర్పవర్తన కలిగిన ముప్పై మంది భారతీయ ఖైదీలను పాకిస్తాన్ విడుదల చేసింది. అందులో జైపూర్కు చెందిన 70 ఏళ్ల గజానంద్ శర్మ ఉన్నారు.
అట్టారి - వాఘా సరిహద్దు గుండా అతను 36 ఏళ్ల క్రితం మన దేశంలోకి అడుగు పెట్టారు. 1982లో ఆయన కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆయన తన సొంతూరుకు వచ్చారు. ఆయన తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

ఆయన భారత్ తిరిగి వచ్చిన సమయంలో కుర్తా, నల్లటి చెప్పులు, చేతిలో తెల్లటి ప్లాస్టిక్ సంచితో వచ్చారు. రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించి, అతనిని దేశంలోకి అనుమతించారు. విప్రా ఫౌండేషన్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.
గజానంద్ శర్మ రాకతో ఆయన సతీమణి భావోద్వేగానికి లోనయ్యారు భర్త తిరిగి వచ్చాడనే విషయం ఇన్నేళ్ల తర్వాత నమ్మలేకపోతున్నామన్నారు. ఇన్నాళ్లు కుటుంబ పెద్ద లేకుండా ఉన్నామన్నారు. ఆయన తిరిగి వచ్చేందుకు సహకరించిన వారికి థ్యాంక్స్ చెప్పారు.
-
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications