Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్‌లో కీలక ఉగ్రవాది, జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ హతం

జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.

శ్రీనగర్: జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.

సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్‌ ఆపరేషనల్‌ హెడ్‌, కీలక ఉగ్రనేత అబు ఖలీద్‌ను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

బారాముల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ఉగ్రవాదిని మట్టుబెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీద్‌.. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది. ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌కు కొద్ది గంటల ముందే బుద్గాం జిల్లాలోని ద్రాంగ్‌ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+