ఎమర్జెన్సీ డే: ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చారు. ఎమర్జెన్సీ డేను బీజేపీ బ్లాక్ డేగా నిర్వహించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి సోమవారానికి 43 ఏళ్లు అయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ రోజులను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గుర్తు చేస్తూ ఇందిరా గాంధీపై మండిపడ్డారు.
'హిట్లర్, ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని ఏరోజూ ఖాతరు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. హిట్లర్ పార్లమెంటులోని విపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసి పార్లమెంటులోని తన మైనారిటీ ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల ఆధిక్యాన్ని సాధించార'ని జైట్లీ పేర్కొన్నారు.

హిట్లర్కు మాదిరిగానా ఇందిరా గాంధీ సైతం ఆనువంశిక ప్రజాస్వామ్యంగా దేశాన్ని మార్చారన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశమంతా భయం గుప్పిట్లో చిక్కుకుందని, రాజకీయ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయన్నారు. మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. అసమ్మతి నేతలను ముఖ్యంగా విపక్ష పార్టీల కార్యకర్తలు, ఆరెస్సెస్ కార్యకర్తలను టార్గెట్ చేశారన్నారు.
అయినప్పటికీ వారు నిరంతర సత్యాగ్రహాలతో స్వచ్ఛందంగా అరెస్టయ్యారన్నారు. అప్పట్లో ఇందిరా గాంధీ.. విపక్షాలు దేశాన్ని స్థిరపరచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని, 353వ అధికరణ కింద దేశంలో ఎమర్జెన్సీ విధించారన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications