తగలబడిన చెన్నై, పోలీస్ స్టేషన్ కు నిప్పు, మాతో పెట్టుకుంటే ?
చెన్నై: జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఒక్క సారిగా రెచ్చిపోయారు.
మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను సోమవారం ఉదయం పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద తమిళనాడు ప్రభుత్వం తమ ప్రతాపం చూపించడానికి ప్రయత్నించింది.
అందుకోసం పోలీసులను అక్కడికి పంపించడంతో పరిస్థితి ఒక్క సారిగామారిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో విద్యార్థులు సహనం కోల్పోయారు. పోలీసులు, విద్యార్థుల మధ్య మాటల యుద్దం జరిగింది.

ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీలకు పని చెప్పడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. వేలాది మంది విద్యార్థులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ ముట్టడించి నిప్పంటించారు. సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పటించడంతో జల్లికట్టు పోరాటం హింసాత్మకంగా మారిపోయింది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపుచెయ్యడానికి ప్రయత్నించారు. అయితే వేలాది మంది విద్యార్థులను అదుపుచెయ్యడం పోలీసులకు సాధ్యంకాలేదు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితి అదుపు చెయ్యడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications