బ్రిటీష్ గుర్తు: ‘జాతీయ గీతంగా ‘జనగణమన’ వద్దు’
అలీగఢ్: మన దేశ జాతీయ గీతం ‘జనగణమన' ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదని, దాని బదులు ‘వందేమాతరం' లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా' గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలని ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ అభిపాయ్రపడ్డారు.
పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 92ఏళ్ల ఈ కవి పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్.. 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు.' అని తెలిపారు.
‘బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది (ఇంగ్లీష్కు) బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు' అని నీరజ్ అన్నారు. ‘వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు.

జనగణమన గీతంలో ‘అధినాయక' అంటే నియంత. ‘జయహే భారత భాగ్య విధాత' అంటే.. దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..'లో సింధ్ ఇప్పుడు భారతలో ఉందా?' అని ఆయన ప్రశ్నించారు.
అందువల్ల జనగణమన గీతానికి బదులు వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, అది తన రచనలను చూస్తే తెలుస్తుందని అన్నారు. తన రచనలు, కవితలు మానవత్వానికి సంబంధించినవిగా ఉంటాయని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications