బ్రిటీష్ గుర్తు: ‘జాతీయ గీతంగా ‘జనగణమన’ వద్దు’
అలీగఢ్: మన దేశ జాతీయ గీతం ‘జనగణమన' ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదని, దాని బదులు ‘వందేమాతరం' లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా' గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలని ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ అభిపాయ్రపడ్డారు.
పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 92ఏళ్ల ఈ కవి పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్.. 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు.' అని తెలిపారు.
‘బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది (ఇంగ్లీష్కు) బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు' అని నీరజ్ అన్నారు. ‘వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు.

జనగణమన గీతంలో ‘అధినాయక' అంటే నియంత. ‘జయహే భారత భాగ్య విధాత' అంటే.. దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..'లో సింధ్ ఇప్పుడు భారతలో ఉందా?' అని ఆయన ప్రశ్నించారు.
అందువల్ల జనగణమన గీతానికి బదులు వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, అది తన రచనలను చూస్తే తెలుస్తుందని అన్నారు. తన రచనలు, కవితలు మానవత్వానికి సంబంధించినవిగా ఉంటాయని తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications