వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టు తీర్పు: శశికళ జయా గ్రూప్ టీవీ చానల్స్ లో ఏం వచ్చిందంటే !

శశికళ యాజమాన్యంలోని జయా గ్రూప్ టీవీ చానల్స్ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు గురించి ఒక్క వార్త కూడా ప్రసారం చెయ్యలేదు. ఎంజీఆర్ నటించిన పాత సినిమాలను టీవీల్లో ప్రసారం చేస్తూ కాలం గడిపేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు సీఎం కావాలని కలలు కని చివరికి జైలుకు వెలుతున్న శశికళకు ఆమె యాజమాన్యంతో నడుస్తున్న టీవీ చానెల్స్ మంగళవారం మౌనపోయాయి. దేశంలోని అన్ని మీడియా చానల్స్ జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష పడుతుందా ? లేదా ? అంటూ ఆసక్తిగా వార్తలు ప్రసారం చేశాయి.

పన్నీర్ సెల్వంకు రూట్ క్లియర్: నేడు గవర్నర్ ఆహ్వానం !పన్నీర్ సెల్వంకు రూట్ క్లియర్: నేడు గవర్నర్ ఆహ్వానం !

కొన్ని అంతర్జాతీయ మీడియా చానల్స్ సైతం శశికళ భవిష్యత్తు ఏమిటీ ? అని ఆసక్తిగా గమనిస్తూ ఏప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. జయలలిత మరణం తరువాత ఆమె యాజమాన్యంలోని జయ గ్రూప్ టీవీ చానల్స్ శశికళ చేతిలోకి వెళ్లిపోయాయి. మంగళవారం జయా గ్రూప్ చానల్స్ మాత్రం ఒక్కటంటే ఒక్క వార్త ప్రసారం చెయ్యలేదు.

jaya group TV channels did not telecast about the Supreme court judgement on Sasikala asset cases.

ఎంజీఆర్ నటించిన పాత సినిమాలను టీవీల్లో ప్రసారం చేస్తూ కాలం గడిపేశారు. చిన్నమ్మ భక్తి చాటుకోకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని అనుకున్న జయా టీవీ గ్రూప్స్ సిబ్బంది కేవలం సినిమాలు మాత్రం ప్రసారం చేసాయి. అంతే కాకుండా కొన్ని కామిడీ క్లిప్పింగ్స్ వేసుకుంటూ దేశంలో ఏమీ జరగలేదని ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నించారు.

గవర్నర్ ఆదేశం:హై అలర్ట్, ఆంధ్రా బార్డర్ క్లోజ్, తమిళనాడులో ఏం జరుగుతోంది!గవర్నర్ ఆదేశం:హై అలర్ట్, ఆంధ్రా బార్డర్ క్లోజ్, తమిళనాడులో ఏం జరుగుతోంది!

అయితే బుల్లితెర వీక్షకులను మోసం చెయ్యడం అంత సులభం కాదని తెలీదు పాపం ఈ టీవీ చానల్ నిర్వహకులకు. ప్రేక్షకులు మాత్రం టీవీ చానల్స్ తిప్పేసి వేరే తమిళ చానల్స్ చూస్తూ ఏం జరిగింది అని ఆసక్తిగా తెలుసుకున్నారు. మొత్తం మీద జయలలిత మరణించిన విషయంలో మొదట జయా టీవీలోనే అమ్మ ఇక లేరు అని ప్రసారం అయ్యింది.

డిసెంబర్ 5వ తేది సాయంత్రం 5.45 గంటల సమయంలో జయలలిత మరణించారని జయా టీవీ చానల్ లో ప్రసారం అయిన తరువాత శశికళ ఆదేశాల మేరుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలో పోరపాటు జరిగిందని జయా టీవీ వివరణ ఇచ్చింది. అయితే అదే రోజు అర్దరాత్రి జయలలిత మరణించారని జయా టీవీ అధికారికంగా దృవీకరిస్తూ వార్తలు ప్రసారం చేసింది.

English summary
Jayalalithaa’s Jaya group TV channels did not telecast about the Supreme court judgement on Sasikala asset cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X