అమ్మ మరణ వార్తను తొలుత ప్రసారం చేసింది 'జయ టీవీ'యే..
జయలలిత టీవీ గ్రూప్కు చెందిన 'జయ ప్లస్' చానెల్ ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ తొలుత వార్తలు ప్రసారం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో సాయంత్రం 5.30గం.ల సమయంలో ఆమె మరణించిందన్న విషాద వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అమ్మ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అమ్మ మరణ వార్త తట్టుకోలేని కొంతమంది అభిమానులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టడంతో.. పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లుగా కనిపించాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అపోలో ఆసుపత్రి వర్గం మరణ వార్తలను ఖండించింది. జయలలితకు చికిత్స ఇంకా కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో.. పరిస్థితులు కొంచెం అదుపులోకి వచ్చాయి.
కాగా, జయలలిత మరణవార్తను మొదట ప్రసారం చేసింది జయకు చెందిన స్వంత టీవి చానెలే అన్న ఆరోపణలు వస్తున్నాయి.జయలలిత టీవీ గ్రూప్కు చెందిన 'జయ ప్లస్' చానెల్ ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ తొలుత వార్తలు ప్రసారం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మిగతా తమిళ చానెళ్లతో పాటు నేషనల్ మీడియా కూడా జయ మృతి వార్త నిజమేననుకుని ప్రసారం చేయడం మొదలుపెట్టాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జయలలిత మరణ వార్త ప్రసారం చేస్తున్నట్లుగా ఆరోపణలను జయ టీవి ఖండించడం గమనార్హం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications