జయలలితకు లభించని ఊరట: విభేదించిన ఇద్దరు జడ్జిలు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఊరట లభించలేదు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) తొలగింపు కేసు పై న్యాయస్థానం ముందుకు వచ్చింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక పీపీ భవానీ సింగ్ను తొలగించాలని గతంలో జయలలిత గతంలో కేసు వేశారు. దీనిపై డీఎంకే నేత అన్బజగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, భవానీ సింగ్ అపాయింటుమెంట్ పైన ద్విసభ్య బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు విభేదించారు.
భవానీ సింగ్ అపాయింటుమెంట్ సరికాదని ఓ న్యాయమూర్తి అయిన జస్టిస్ మదన్ బీ లోకుర్ అన్నారు. మరో న్యాయమూర్తి భానుమతి మాత్రం దానిని సమర్థించారు. దీంతో దీనిని త్రిసభ్య బెంచ్కు అప్పీల్ చేశారు. కాగా, జయలలిత అక్రమంగా రూ.66.65 కోట్ల ఆస్తులు కూటబెట్టారన్న కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.