అందువల్లే జయలలిత వేలిముద్ర వేశారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఫిజియో థెరపీ చికిత్స అందిస్తున్నారని, అందు వలనే ఆమె బీ-ఫామ్స్ లో సంతకాలు చెయ్యలేకపోయారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ అన్నారు.
తమిళనాడులోని మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల సందర్బంగా అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇచ్చిన సమయంలో జయలలిత సంతకంకు బదులుగా వేలిముద్రలు వేసిన విషయం తెలిసిందే. వేలిముద్రలు ఉండటంతో ఎన్నికల అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదు.

ప్రభుత్వ వైద్యులు సహా జయలలిత వేలిముద్రలపై దృవీకరణ పత్రం ఇచ్చారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ గుర్తు చేశారు. అయితే కొంత మంది నాయకులు కుళ్లు రాజకీయలు చెయ్యడానికి ఈ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని రామచంద్రన్ మండిపడ్డారు.
జయలలిత ఆరోగ్యంపై పుకార్లు నమ్మరాదని ఆయన కార్యకర్తలకు మనవి చేశారు. అమ్మ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చెయ్యడానికి వస్తారని రామచంద్రన్ అన్నారు. అమ్మ కోసం ప్రజలు, పార్టీ కార్యకర్తలు చేసిన పూజలు ఫలించాయని అన్నాడీఎంకే నాయకుడు రామచంద్రన్ అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications