ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?: జేడీఎస్ దెబ్బకు దెబ్బ, బీజేపీ ఎమ్మెల్యేలకు వల

బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జేడీఎస్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ముందుకు వెళ్తోంది. కుమారస్వామిని సీఎంగా చేద్దామంటూ బీజేపీలోని ఒక్కలిగ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపిస్తోందని తెలుస్తోంది.

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు... మన వాడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని బీజేపీకి చెందిన ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలకు జేడీఎస్ నేతలు పిలుపునిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా బీజేపీని దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

JD-S eye on BJP MLAs: Man to man marking, 200 marshals for 221 MLAs

కాగా, అసెంబ్లీ బల నిరూపణలో బీజేపీ గట్టెక్కేందుకు పలు అవకాశాలు ఉన్నాయి. పార్టీ విప్ ధిక్కరించి ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు దూరంగా ఉంచడం, ఓటమి తప్పదవి భావిస్తే గందరగోళం సృష్టించడం వంటివి ముందు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ - జేడీఎస్‌లు కూడా గందరగోళం సృష్టించవచ్చు.

విపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామా కూడా చేయించవచ్చు. కానీ ఇప్పటికి ఇప్పుడు రాజీనామాలు, ఆమోదం కుదరదు. కాబట్టి వారిని ఓటింగ్‌కు దూరంగా ఉంచడం, అవసరమైతే ఆ తర్వాత రాజీనామా చేయించడం వంటి అంశాలు బీజేపీ ముందు ఉన్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+