కర్ణాటకలో హంగ్: కాంగ్రెస్ తో పొత్తుకు జేడీఎస్ గ్రీన్ సిగ్నల్, గవర్నర్ కు లేఖ, బీజేపీ ఆశలపై నీళ్లు!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుకు అంగీకరించిన జేడీఎస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలాకు లేఖ రాసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.
బెంగళూరు నగరంలోని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ నివాసంలో హెచ్.డి. కుమారస్వామి మంగళవారం దాదాపు మూడు గంటల పాటు చర్చించి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా జేడీఎస్ కు మద్దతు ప్రకటించింది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు మంత్రి వర్గం నిర్ణయాలు మొత్తం జేడీఎస్ కు వదిలిపెట్టిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ ఒక్కటి కావడంతో మెజారిటీకి మించిన శాసన సభ్యులు వారి పక్షాన నిలిచారు.
104 సీట్లు సంపాధించిన బీజేపీ ఇప్పుడు అధికారానికి దూరం కావలసిన పరిస్థితి ఎదురైయ్యింది. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి అర్థం కావడంలేదు. బీజేపీ నాయకులకు చాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు ముందుగానే జేడీఎస్ నాయకులను సంప్రధించి బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications