JEE Main Result 2021 out: 44 మందికి 100 శాతం, 18 మందికి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్(నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్ష మండలి(ఎన్టీఏ) విడుదల చేసింది.
ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది 100 శాతం, 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు. కటాఫ్ మార్కులను కూడా విడుదల చేసింది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, DigiLocker లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దీనిలో ప్రధాన ఫలితం, ఎన్టీఏ స్కోర్ కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. పరీక్ష నాల్గవ సెషన్ను ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.
Recommended Video
మరోవైపు, ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2021 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేశారు.