జియాఖాన్ది ఆత్మహత్య: సిబిఐ, టైం అడిగిన తల్లి
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి కేసు మిస్టరీ వీడింది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సిబిఐ ధ్రువీకరించింది. ఈ కేసులో మళ్లీ విచారణ అవసరం లేదని కూడా అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది.
తాము సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ, సైంటిఫిక్, ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. జియా తల్లి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే సీబీఐ ఎఫ్బీఐ సహకారం కూడా తీసుకోవాలని పిటీషన్ వేసింది.

జియా సూసైడ్ లేఖ రాయడానికి ముందు అరగంటకు పైగా తన ఫ్లాట్లోనే ఉందని, ఓ లేఖ రాయడానికి ఈ సమయం సరిపోతుందని సీబీఐ పేర్కొంది. జియా.. సూరజ్కి 400 సెకన్ల పాటు మెసేజ్లు చేసిందని ఆ తర్వాత కూడా లేఖ రాయడానికి తగిన సమయం ఉందని సీబీఐ వివరించింది.
కాగా, సీబీఐ చెప్పిన విషయాలపై తనకు సమయం కావాలని జియా ఖాన్ తల్లి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు జూలై 6వ తేదీకి వాయిదా పడింది. 2013, జూన్ 3న జియాఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్ పంచోలీ నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications