కాశ్మీర్ పండిట్‌లకు ప్రత్యేక టౌన్‌షిప్‌లు: శ్రీనగర్‌లో ఆందోళనలు

శ్రీనగర్: కాశ్మీర్‌లో మరోసారి ఆందోళనలు ఊపందుకున్నాయి. కాశ్మీర్ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నారనే అంశంపై యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద పలువురు ఆందోళన చేపట్టారు.

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ, భాష్పవాయువును ప్రయోగించారు.

JKLF supporters protest in Srinagar over rehabilitation of Kashmiri pandits

జేకేఎల్ఎఫ్ నిర్వహంచిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జమ్మా కాశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్ ఈ వారం మొదట్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన తర్వాతనే మొదలయ్యాయి.

కాశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న టౌన్‌షిప్‌ల కోసం భూమి ఇచ్చేందుకు సీఎం ముప్తీ తొలుత అంగీకరించినా, ఆ తర్వాత కాశ్మీర్ పండిట్లు విడిగా ఉండేందుకు వీలు కాదని, కలిసి జీవించాల్సిందేనంటూ హోం మంత్రితో చెప్పినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్‌ శుక్రవారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీనగర్ లాల్ చౌక్ మొత్తం అల్లర్లతో ఉడికిపోతుంది. శనివారం పూర్తి బంద్‌గా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+