'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం'గా కలాం ట్విట్టర్ ఐడీ
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో సాగనుంది. అబ్దుల్ కలాంకు అత్యంత సన్నిహితులు 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ అకౌంట్ను కొనసాగించాలని నిర్ణయించారు.
డాక్టర్ కలాం ఆలోచనలు, పాఠాలు, ప్రణాళికలను ట్విట్టర్లో పంచుకుంటామని ఆయన సన్నిహితులు చెప్పారు. కలాంతో సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్.. ఈ ట్విట్టర్ అకౌంట్ బాధ్యతలు చూస్తున్నారు. మిస్ యూ సర్ అంటూ శ్రీజన్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు.
Dedicated2immortal
memories
of
Dr
Kalam.this
account
wil
nw
reflect
his
thoughts,his
lessons&missions.Miss
you
sir!@srijanpalsingh
(admin)
—
In
memoryof
Dr.Kalam
(@APJAbdulKalam)
July
27,
2015
"Creating
a
livable
planet
earth"
-
Dr.
Kalam's
last
lectures
title...
was
to
be
given
at
IIM
Shillong.-
@srijanpalsingh
—
In
memoryof
Dr.Kalam
(@APJAbdulKalam)
July
27,
2015
What
I
will
be
remembered
for..
my
memory
of
the
last
day
with
the
great
Kalam
sir...
http://t.co/a6z2rnJbKk-
@srijanpalsingh
—
In
memoryof
Dr.Kalam
(@APJAbdulKalam)
July
28,
2015
డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక సందేశాలు, ఆయన ఉపన్యాసాలు ఈ ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచి ట్విట్ చేస్తారు. అదే విధంగా అబ్దుల్ కలాం రచించిన రచనలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇండియా 2020', 'ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాలలోని ముఖ్యమైన వ్యాఖ్యాలను కూడా ట్వీట్ చేస్తారు. ట్విట్లర్లో అబ్దుల్ కలాంకు 14 లక్షల 3 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.