తల్లిదండ్రుల కళ్లెదుటే ఆర్‌ఎస్ఎస్ కార్యకర్త హత్య

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కొందరు దుండగులు(సీపీఎం నాయకులుగా భావిస్తున్నవారు) అతని తల్లిదండ్రుల కళ్ల ముందే హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇరువర్గాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వర్గపోరుకు తెరదించేందుకు చర్చలు జరుపాలని ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్ పిలుపునిచ్చారు. కాగా, ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోమవారం రాత్రి హత్యకు గురికావడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

సోమవారం రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుజిత్‌(27) ఇంట్లోకి ప్రవేశించి దుండగులు అతన్ని కొట్టి చంపారు. సుజిత్ తల్లిదండ్రులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దుండగులు దాడిచేశారు.

Kannur tense as RSS worker hacked to death in front of parents

ఈ ఘటనలో సుజిత్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన దుండగులు సీపీఎంకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కన్నూర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియెరి బాలకృష్ణన్ స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య కాదని, స్థానిక గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోందని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 8 మంది సీపీఎం మద్దతుదారులను అరెస్టు చేశారు. జిల్లాలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి సీపీఎం ప్రయత్నిస్తున్నదని బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆరోపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+