Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లిదండ్రుల కళ్లెదుటే ఆర్‌ఎస్ఎస్ కార్యకర్త హత్య

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కొందరు దుండగులు(సీపీఎం నాయకులుగా భావిస్తున్నవారు) అతని తల్లిదండ్రుల కళ్ల ముందే హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇరువర్గాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వర్గపోరుకు తెరదించేందుకు చర్చలు జరుపాలని ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్ పిలుపునిచ్చారు. కాగా, ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోమవారం రాత్రి హత్యకు గురికావడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

సోమవారం రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుజిత్‌(27) ఇంట్లోకి ప్రవేశించి దుండగులు అతన్ని కొట్టి చంపారు. సుజిత్ తల్లిదండ్రులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దుండగులు దాడిచేశారు.

Kannur tense as RSS worker hacked to death in front of parents

ఈ ఘటనలో సుజిత్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన దుండగులు సీపీఎంకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కన్నూర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియెరి బాలకృష్ణన్ స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య కాదని, స్థానిక గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోందని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 8 మంది సీపీఎం మద్దతుదారులను అరెస్టు చేశారు. జిల్లాలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి సీపీఎం ప్రయత్నిస్తున్నదని బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆరోపించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+