తల్లిదండ్రుల కళ్లెదుటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కొందరు దుండగులు(సీపీఎం నాయకులుగా భావిస్తున్నవారు) అతని తల్లిదండ్రుల కళ్ల ముందే హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వర్గపోరుకు తెరదించేందుకు చర్చలు జరుపాలని ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. కాగా, ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోమవారం రాత్రి హత్యకు గురికావడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుజిత్(27) ఇంట్లోకి ప్రవేశించి దుండగులు అతన్ని కొట్టి చంపారు. సుజిత్ తల్లిదండ్రులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దుండగులు దాడిచేశారు.

ఈ ఘటనలో సుజిత్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన దుండగులు సీపీఎంకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కన్నూర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది.
సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు కొడియెరి బాలకృష్ణన్ స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య కాదని, స్థానిక గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోందని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 8 మంది సీపీఎం మద్దతుదారులను అరెస్టు చేశారు. జిల్లాలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి సీపీఎం ప్రయత్నిస్తున్నదని బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆరోపించాయి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications