జేసీబీని ఢీకొట్టిన బస్సు: 17కు పెరిగిన మృతుల సంఖ్య -ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి -కేంద్రం రూ.2లక్షల పరిహ
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. లక్నో నుంచి ఢిల్లీ వెళుతోన్న యూపీ ఆర్టీసీ బస్సు కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద ఎదురుగా వచ్చిన జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Recommended Video
కాన్పూర్ బస్సు దుర్ఘటపై కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, మృతుల సంఖ్య 17కు పెరిగిందని, గాయపడ్డ ఇతరులకు కాన్పూర్ లోని ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నామని, అతి వేగమే ప్రమాదానికి కారణంగా ప్రధామిక దర్యాప్తును బట్టి వెల్లడైందని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తామని ఐజీ తెలిపారు. కాగా,

కాన్పూర్ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించిందని, చనిపోయివారి కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతున్నానని, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారాన్ని అందిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కాన్పూర్ బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార బీజేపీ నేతలంతా దుర్ఘటనపై వేగంగా స్పందించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications