కర్నాల్లో రైతులపై లాఠీఛార్జీ: రక్తం కళ్ల చూశారంటూ రాహుల్ ఫైర్, నిరసనలకు నేతల పిలుపు
ఛండీగఢ్: హర్యానాలోని కర్నాల్ ఘరౌండ టోల్ ప్లాజా వద్ద శనివారం నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పోలీసుల లాఠీ ఛార్జీ చేయడంతో పలువురు రైతు నేతలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా హైవేల ముట్టడికి పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేఎం) పిలుపునిచ్చారు.
శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని రైతు నేత దర్శన్ పాల్ తెలిపారు. కాగా, కర్నాల్లో రైతులు శనివారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభకు దారితీసే రోడ్లను, జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.

ఈ నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు ఇరువైపుల నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జీ చేసి విరుచుకుపడ్డారు. పలువురు రైతు నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రైతు సంఘాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి.
फिर ख़ून बहाया है किसान का,
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2021
शर्म से सर झुकाया हिंदुस्तान का!#FarmersProtest #किसान_विरोधी_भाजपा pic.twitter.com/stVlnVFcgQ
ఛండీగఢ్: హర్యానాలోని కర్నాల్ ఘరౌండ టోల్ ప్లాజా వద్ద శనివారం నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పోలీసుల లాఠీ ఛార్జీ చేయడంతో పలువురు రైతు నేతలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా హైవేల ముట్టడికి పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేఎం) పిలుపునిచ్చారు.
శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని రైతు నేత దర్శన్ పాల్ తెలిపారు. కాగా, కర్నాల్లో రైతులు శనివారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభకు దారితీసే రోడ్లను, జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
ఈ నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు ఇరువైపుల నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జీ చేసి విరుచుకుపడ్డారు. పలువురు రైతు నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రైతు సంఘాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications