కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి షాక్: మంత్రి పదవికి బీఎస్పీ ఎమ్మెల్యే రాజీనామా
బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. బీఎస్పీ ఎమ్మెల్యే, ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖ మంత్రి ఎన్ మహేశ్ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
బహుజన్ సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మహేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మాయావతి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మాయావతి ఆదేశాల మేరకు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నుంచి తాను తప్పుకున్నట్లు మహేశ్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కులాలు, అసమానతలు తొలగినప్పుడే బహుజనులుఅధికారంలోకి వస్తారని అన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications