విచిత్రం: మంత్రులే లేని నాలుగు మంత్రివర్గ సమావేశాలు, సీఎం యడియూరప్ప సంతకం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతున్నాయి. ఒక్క మంత్రి కూడా లేకుండానే సీఎం యడియూరప్ప మంత్రివర్గం సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు సీఎం యడియూరప్ప వివిద శాఖలకు చెందిన అధికారులతో నాలుగు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించారు.
విచిత్రం ఏమిటంటే కర్ణాటకలో ఇప్పటి వరకు మంత్రివర్గం ఏర్పాటే చెయ్యలేదు. కేలవం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిద శాఖలకు చెందిన అధికారులతో సీఎం యడియూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మూడు వారాల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.

కర్ణాటక ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి (ముఖ్యమంత్రి) బీఎస్. యడియూరప్ప. మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్లు సంతకాలు చేసే రిజిస్టర్ లో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే సంతకం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజలు సమస్యలు పరిష్కరించడం కోసం సీఎం యడియూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులతో పాటు సీనియర్ అధికారులతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహిస్తున్నారు.
మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి కోసం సీఎం యడియూరప్ప వేచి చూశారు. బీజేపీ హైకమాండ్ అనుమతితో బీఎస్. యడియూరప్ప ఆగస్టు 20వ తేదీ మంగళవారం మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి సిద్దం అయ్యారు. అయితే ఇప్పటికే సీఎం యడియూరప్ప నేతృత్వంలో అధికారికంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications