సీఎం కుర్చీ అంటే పూలపాన్పు స్థానం కాదు, ఆ సీటు గురించి వివరించిన సీఎం !
బెంగళూరు/మైసూరు: ఇది నా చివరి ఎన్నికలు. అయితే నాకు ఊపిరి ఉన్నంత వరకు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం మైసూరు జిల్లాలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కృతజ్ఞతా సభలో సీఎం సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిద్దరామయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ఓటర్లకు వింధు భోజనం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ 2013లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పినట్లు చేసి అన్ని కులాలు, మతాలు, సమాజంలోని అన్ని వర్గాల తరపున సంక్షేమ కార్యక్రమం రూపొందించాను. ఈ సారి మా ప్రభుత్వం కర్ణాటకకు మరింత సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

అవినీతి, నిర్వహణలోపం, అభివృద్ధిలోపం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుర్మార్గపు రాజకీయాలను (బీజేపీని) కర్ణాటక ప్రజలు ఓడించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీని ఓడించిన కర్ణాటక ప్రజలకు తాను కృతజ్ఞుడను అని సీఎం సిద్దరామయ్య అన్నారు. బసవుడి ఆదర్శాలతో తాను పని చేస్తానని, బసవ జయంతి రోజున తొలిసారిగా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేశానని సీఎం సిద్దరామయ్య చెప్పారు.
ముఖ్యమంత్రి కుర్చీ సంతోషం కలిగించే పూలపాన్పు కుర్చీ కాదని, తనకు వచ్చిన సీఎం పదవితో ప్రజల జీవితాలను మెరుగుపరిచే అవకాశంగా భావిస్తున్నానని సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చెయ్యలేక కర్ణాటక రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆ రోజు ఆరోపించారని, ఇప్పుడు మేము ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మా ప్రణాళికకు ప్రధాని మోడీ సహకరించాలి. కానీ మోదీ పేద, మధ్యతరగతి వర్గాల ప్రగతి, అభివృద్ధిని కోరుకోవడం లేదని సిద్దరామయ్య ఆరోపించారు.
అందుకే బీజేపీ సంప్రదాయం ప్రకారం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలోని మహిళలందరికీ ఎక్స్ప్రెస్తో పాటు అన్ని బస్సుల్లో కర్ణాటకలోనే ఉచిత ప్రయాణం కల్పించేందుకు శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నామని, శక్తి పథకం సవ్యంగా అమలు కావడానికి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications