వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సిద్దూకు ఓటమి భయం, రెండు చోట్ల పోటీ, క్లారిటీ ఇచ్చిన కుమారుడు, డేట్ ఫిక్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గం నుంచి కాకుండా బాగల్ కోటే జిల్లా బాదామిలో పోటీ చేస్తారని స్పష్టంగా వెలుగు చూసింది. ఇంత కాలం ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని అనుకున్న ప్రజలకు స్వయంగా సీఎం సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర క్లారిటీ ఇచ్చారు.

సీఎంకు భయం !

సీఎంకు భయం !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు ఓటమి ఎదురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారని సమాచారం.

అధిష్టానం ఆలోచన

అధిష్టానం ఆలోచన

చాముండేశ్వరి నియోజక వర్గంతో పాటు బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో పోటీ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య నిర్ణయించారు. అయితే రెండు చోట్ల సీఎం పోటీ చేస్తే పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, ఒకే నియోజక వర్గంలో పోటీ చెయ్యాలని సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది.

సీఎం కుమారుడు క్లారిటి !

సీఎం కుమారుడు క్లారిటి !

ఈనెల 23వ తేదీ బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నామినేషన్ వేస్తారని ఆయన కుమారుడు, మైసూరు జిల్లా వరుణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యతీంద్ర ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

రెండు నియోజక వర్గాలు !

రెండు నియోజక వర్గాలు !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంతో పాటు బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని స్వయంగా ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సీఎంకు గట్టి పోటీ !

సీఎంకు గట్టి పోటీ !

మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గం ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. సీఎం సిద్దరామయ్య శుక్రవారం చాముండేశ్వరి నియోజక వర్గంలో నామినేషన్ వెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

English summary
Karnataka Assembly Elections 2018: Along with Chamundeshwari constituency in Mysuru, chief minister Siddaramaiah will be contesting from Badami constituency in Bagalkot district in upcomming Assembly elections. His son Dr. Yathindra in his facebook post confirmed his father's candidature from Badami. Siddaramaiah will be filing his nomination from here on April 23rd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X