ABP ఎగ్జిట్ పోల్ సర్వే: కర్నాటకలో అధికారం బీజేపీదే, కానీ, వెనుకడిన కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీకి దగ్గరగా సీట్లు సాధిస్తుందని ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదని ఈ సర్వే తెలిపింది.
ఈ సర్వే ప్రకారం బీజేపీకి 97-109, కాంగ్రెస్ పార్టీకి 87-99, జేడీఎస్కు 21-30, ఇతరులకు 1-8 సీట్లు వస్తాయని తేలింది.
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 15న ఫలితాలు రానున్నాయి. అయితే, ఓటింగ్ ముగియగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు పూర్తి కాగానే పలు సర్వేలు విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బట్టి మే 15న ఫలితాలపై ఓ అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. 224 స్థానాలకు గాను 222 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.

ఏబీపీ (ABP) ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 87-99
భారతీయ జనతా పార్టీ - 97-109
జేడీఎస్ - 21-30
ఇతరులు - 1-8












Click it and Unblock the Notifications