కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా కేజీ బోపయ్య, బీజేపీ ఎమ్మెల్యే, ఐదేళ్ల అనుభవం, సీఎం ధీమా!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ గా బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కేజీ. బోపయ్యను నియమించారు. వీరాజపేట శాసన సభ్యుడు కేజీ బోపయ్యను విదాన సభ తాత్కాలిక స్పీకర్ గా శిఫారస్సు చేస్తూ శాసన సభ కార్యదర్శి గవర్నర్ వాజుబాయ్ వాలాకు లేఖ రాశారు.

గవర్నర్ ఓకే
కర్ణాటక శాసన సభ కార్యదర్శి శిఫారస్సు లేఖను పరిశీలించి గవర్నర్ వాజుబాయ్ వాలా శుక్రవారం అమోదముద్ర వేశారు. కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ గా కేజీ. బోపయ్యను నియమించారు. 2008 నుంచి 2013 వరకూ కేజీ. బోపయ్య కర్ణాటక శాసన సభ స్పీకర్ గా పని చేశారు.

యడ్యూరప్ప ధీమా
ఐదు సంవత్సరాలు స్పీకర్ గా పని చేసిన అనుభవంతో శనివారం సాయంత్రం 4 గంటలకు విదాన సౌధలో ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను తాత్కాలిక స్పీకర్ బోపయ్య సమర్థవంతంగా నిర్వహిస్తారని అందరూ భావిస్తున్నారు. కేజీ బోపయ్య నియమాకంతో సీఎం యడ్యూరప్ప ధీమాగా ఉన్నారు.

ప్రమాణస్వీకారం
గవర్నర్ వాజుబాయ్ వాలా శుక్రవారం కేజీ. బోపయ్యతో తాత్కాలిక స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ వీ. దేశ్ పాండే, బీజేపీ నుంచి ఉమేష్ కత్తిని తాత్కాలిక స్పీకర్ చెయ్యాలని ఆ పార్టీల నాయకులు భావించారు. అయితే చివరికి కేజీ బోపయ్య ఆసీటులో కుర్చున్నారు.

నో కామెంట్
కేజీ. బోపయ్య స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ను నియమిస్తూ గవర్నర్ వాజుబాయ్ వాలా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తాత్కాలిక స్పీకర్ గా కేజీ బోపయ్యను నియమించడంపై ఇంకా ఏ విధంగాను స్పందించలేదు. బీజేపీ ఎమ్మెల్యే అయిన కేజీ. బోపయ్య శనివారం బలపరీక్ష సమయంలో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications