ఆరోగ్యశాఖ మంత్రికి సోకిన కరోనా: ‘కలిసిన వారందరూ క్వారంటైన్లో ఉండాలి’
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పెద్దలను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములుకు కూడా కరోనా సోకింది.
తనకు కరోనా సోకినట్లు స్వయంగా మంత్రి శ్రీరాములు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి జిల్లాల్లో పర్యటింంచారు. కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, సౌకర్యాలను ఆయన పర్యవేక్షించారు.
ఈ క్రమంలోనే తనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరినట్లు మంత్రి శ్రీరాములు తెలిపారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్లో ఉండాలని కోరారు. కాగా, ఇప్పటికే సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ಇಂದು ಜ್ವರ ಕಾಣಿಸಿಕೊಂಡ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿದಾಗ ಕೊರೊನ ಪಾಸಿಟಿವ್ ಬಂದಿದೆ.
— B Sriramulu (@sriramulubjp) August 9, 2020
ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ನೇತೃತ್ವದಲ್ಲಿ ನನ್ನ ಇಲಾಖೆ ಸೇರಿದಂತೆ ಸರ್ಕಾರದ ಎಲ್ಲಾ ಇಲಾಖೆಗಳೂ ಜೀವದ ಹಂಗು ತೊರೆದು ಮಹಾಮಾರಿಯ ವಿರುದ್ಧ ಹಗಲಿರುಳೂ ಶ್ರಮಿಸುತ್ತಿವೆ.1/3
కాగా, కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,64,924 కరోనా కేసులు నమోదయ్యాయి. 77,685 యాక్టివ్ కేసులున్నాయి. 84,232 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,998 మంది కరోనా బారినపడి మరణించారు.