రూ. కోటి లంచం కేసు: నలుగురికి బెయిల్
బెంగళూరు: లోకాయుక్త లో రూ. కోటి లంచం డిమాండ్ చేశారని అరెస్టు అయిన నలుగురికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురు త్వరలో జైలు నుండి బయటకురానున్నారు.
లోకాయుక్త మాజీ పీఆర్ఓ సయ్యద్ రియాజ్, శ్రీనివాస్ గౌడ, శంకర్ గౌడ, అశోక్ కుమార్ అనే నలుగురు బెయిల్ మంజూరు చెయ్యాలని కర్ణాటక హై కోర్టులో అర్జీ సమర్పించారు. న్యాయమూర్తి ఎల్. నారాయణ స్వామి వీరు సమర్పించిన అర్జీని విచారణకు స్వీకరించారు.
మంగళవారం ఈ నలుగురికి బెయిల్ మంజూరు చేశారు. ఈ నలుగురు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ గడువు పూర్తి అయిన తరువాత బెయిల్ మీద బయటకు రానున్నారు. లోకాయుక్తలో రూ. కోటి లంచం డిమాండ్ చేశారని నమోదు అయిన కేసులో పోలీసులు సిట్ అధికారులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు.
లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ఇదే కేసులో అరెస్టు అయ్యాడు. అశ్విన్ రావ్ అరెస్టు అయిన తరువాత లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ సెప్టెంబర్ 30వ తేది వరకు సెలవు పెట్టి వెళ్లారు.