MLC election: మాజీ సీఎం కొడుక్కి షాక్ ఇచ్చిన హైకమాండ్, ఎమ్మెల్సీ ఎన్నికట్లో నో టిక్కెట్, కోల్డ్ వాటర్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో విదాన పరిషత్ ఎన్నికల వేడి మొదలైయ్యింది. విదాన పరిషత్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం చిక్కిన వాళ్లు సంతోషంగా నామినేషన్లు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి చాన్స్ చిక్కకపోవడంతో కొందరు నాయకులు నిరాశచెందుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
Lady: ఆర్మీ జవాన్ భార్య మీద గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూ. లక్షలు లూటీ, ఆ వీడియోతో!
బీజేపీ లిస్ట్
కర్ణాటకలో ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాట జేడీఎస్ పార్టీలు బిజీ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు పక్రటించాయి. ఇదే సమయంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
నలుగురు సీనియర్స్ కు చాన్స్
బీజేపీ నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ సవది, కేశవ ప్రసాద్, చలువాయి నారాయణస్వామి, హేమలతా నాయక్ పేర్లను బీజేపీ హైకమాండ్ మంగళవారం ప్రకటించింది. విద్యావంతుల నియోజక వర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బసవరాజ్ హోరట్టిని బీజేపీ ప్రకటించింది.
మాజీ సీఎం కొడుక్కి షాక్
మాజీ విదాన పరిషత్ అధ్యక్షుడు అయిన బసవరాజ్ హోరట్టి ఇటీవల సొంత పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు బివి. విజయేంద్రకు నిరాస ఎదురైయ్యింది
దెబ్బకు మైండ్ బ్లాక్
మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కుతుందని ఇంతకాలం అనుకున్న బీజేపీ కార్యకర్తల ఆశల మీద బీజేపీ హైకమాండ్ కోల్డ్ వాటర్ చల్లింది. మాజీ సీఎం కొడుకుగా, బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న బీవై. విజయేంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులతో పాటు బీజేపీలోని ఓ వర్గం షాక్ అయ్యింది.