ఎన్టీఆర్ రోజుల నుంచి చూస్తున్నా: బాబుపై కరుణానిధి
న్యూఢిల్లీ: తన ప్రియమైన పాత మిత్రుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి తాను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ఎదుగుదలను గమనిస్తున్నట్లు డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో విజయం సాధించినందుకు ఆయన మంగళవారం చంద్రబాబును అభినందించారు.
తెలివైన చర్యల ద్వారా, నిజాయితీతో కూడిన శ్రమ ద్వారా చంద్రబాబు నాయుడు విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు తెలివైన చర్యలు, కఠిమైన, నిజాయితీతో కూడిన శ్రమ కారణంగా చంద్రబాబు ప్రజల హృదయాలకు సన్నిహితంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఆ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు నాయకత్వంలో సీమాంధ్ర ప్రశాంతమైన, ప్రయోజనకరమైన పరిపాలనను చూస్తుందని తనకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుకు, టిడిపికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications