అంబానీ ముడుపులు చెల్లించారేమో..! అందుకే అలా.. : కేజ్రీవాల్
ఢిల్లీ : అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు హామి ఇచ్చిన సీఎం కేజ్రీవాల్ ఆచరణలో మాత్రం కష్టాలను ఎదుర్కోక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో కరెంటు బిల్లులు కట్టవద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆయన, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు దగ్గరవుతున్నా..! ఇప్పటికీ కరెంట్ ఛార్జీలను తగ్గించలేకపోయారు.
అయితే, విద్యుత్ ఛార్జీల హామీల విషయంలో తమ వైఫల్యం ఏమి లేదని, అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) వైఖరి వల్లే విద్యుత్ ఛార్జీల తగ్గింపు కుదరట్లేదని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. ఈ విషయంలో అంబానీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన కేజ్రీవాల్, కరెంట్ ఛార్జీలు తగ్గించకుండా ఉండేందుకు అంబానీ ముడుపులు చెల్లించి ఉంటారని ఆరోపించారు.

అంబానీకి చెందిన విద్యుత్ సంస్థ బీఎస్ఈఎస్ పనితీరు ఏమాత్రం బాగా లేదని, ప్రభుత్వాన్ని వేధించేదిగా
సదరు సంస్థ వ్యవహారం తయారైందని మండిపడ్డారు కేజ్రీవాల్. కాగా, విద్యుత్ ఛార్జీల విషయంలో చర్చలకు రావాల్సిందిగా అంబానీని ఆహ్వానించింది ఢిల్లీ సర్కార్. ఈ చర్చలపైనే ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు తగ్గేది లేనిది ఆధారపడి ఉంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications