కేజ్రీవాల్ నిరసన: లేడీస్ టాయిలెట్లో ఆప్ మంత్రి
న్యూఢిల్లీ: కొంత మంది పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన అనుచరులు ధర్నా చేస్తున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సోమనాథ్ భారతి లేడీస్ టాయిలెట్ వాడడం వివాదంగా మారింది.

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి భారతి మంగళవారంనాడు ప్రెస్ క్లబ్లోని లేడీస్ టాయిలెట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. దాంతో మహిళా జర్నలిస్టులు బయట వేచి చూడాల్సి వచ్చింది. పురుషుల టాయిలెట్ పక్కనే ఉన్నప్పటికీ ఆయన లేడీస్ టాయిలెట్లోకి వెళ్లారని మీడియా వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.
ఎన్డీటివి కథనం ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వార్తలను సేకరించడానికి వచ్చిన మహిళా జర్నలిస్టులు భారతి వాష్రూమ్ను వాడుతుండడంతో బయట వేచి ఉన్నారు. వారు ఆయనను అడగడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పబ్లిక్ టాయిలెట్లను ఆందోళనకారులు వాడకుండా పోలీసులు చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అంతకు ముందు విమర్సించారు. పరిసరాల్లోని టాయిలెట్లను అన్నింటినీ పోలీసులు మూసివేయించారని ఆయన ఆరోపించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications