మర్మాంగం కోసేసిన యువతికి సీఎం అభినందన: ఆమె చర్య సాహసోపేతమైనది!..
కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతోనో, భక్తి పేరుతోనో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
తిరువనంతపురం: తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసినందుకు కేరళ సీఎం పినరయి విజయన్ ఆ యువతిని అభినందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు.
కాగా, కేరళకు చెందిన ఒక దొంగ స్వామి ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా.. గట్టిగా ప్రతిఘటించిన ఆ విద్యార్థిని అతని మర్మాంగాన్ని కోసిపారేసింది. కొల్లాంలోని పన్మన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గణేశానంద తీర్థపద స్వామి(54)అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

అయితే తీర్థపద స్వామిని సదరు విద్యార్థిని ఎంత వారించినా అతను వినలేదు. దీంతో అతన్ని అడ్డుకోవడానికి.. తన వద్దనున్న చాకుతో పురుషాంగాన్ని కోసేసింది. అనంతరం తిరువనంతపురం పోలీసులకు విద్యార్థినే ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులు కూడా విద్యార్థినిపై కేసు పెట్టకుండా.. ఆ దొంగస్వామి పైనే పోస్కో చట్టం కింద కేసు పెట్టారు.
కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతోనో, భక్తి పేరుతోనో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications