కేజ్రీతో జైట్లీ గొడవ: బిజెపి నుంచి కీర్తి ఆజాద్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ పైన ఆ పార్టీ అధిష్టానం బుధవారం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పైన కీర్తి ఆజాద్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. జైట్లీ తన పైన పరువు నష్టం దావా వేయాలని కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కీర్తి పైన బిజెపి కఠిన చర్యలు తీసుకుంది.

డిడిసిఎ వ్యవహారం కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య వేడిని రాజేస్తోన్న విషయం తెలిసిందే. డిడిసిఎలో అరుణ్ జైట్లీ ఉండగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇలాంటి సమయంలో కీర్తి ఆజాద్ సొంత పార్టీ మంత్రి జైట్లీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది బిజెపిని ఇరుకున పెడుతోంది. దీంతో, బిజెపి పెద్దలు చర్చించిన అనంతరం ఆయన పైన వేటు వేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications