ఆజాద్ ఇష్యూ, బిజెపిలో కలకలం: జోషి-అద్వానీ భేటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నట్లుగా కనిపిస్తోంది. డిడిసిఎ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బుధవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
కీర్తి ఆజాద్కు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రామ్ జెత్మలానీ, శతృఘ్ను సిన్హాలు ఆయనకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత మరో బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మాట్లాడుతూ... కీర్తి ఆజాద్ వంటి నిజాయితీపరుడ్ని పార్టీ వదులుకోదని చెప్పారు.

కీర్తి ఆజాద్ మాట్లాడుతూ... తనకు పలువురు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. తనకు నోటీసు అందిందని, దీనిపై తాను సమాధానం చెబుతాన్నారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు రాసే పత్రం విషయంలో సుబ్రహ్మణ్య స్వామి తనకు సహకరిస్తానని చెప్పారన్నారు.
మరోవైపు, గురువారం నాడు బీజేపీ అగ్రనేతలు మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ, శాంత కుమార్లు భేటీ అయ్యారు. వారు కీర్తి ఆజాద్ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జోషి నివాసంలో వారు భేటీ అయ్యారు. ఇప్పటికే మోడీ - అమిత్ షాల పైన అసంతృప్తితో ఉన్న సీనియర్లు, ఇతరులు కీర్తి ఆజాద్కు మద్దతుగా నిలవనున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications